వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు వాహనాలు ఢీకొనడంలో నలుగురు మరణించగా, పలువులు గాయపడ్డారు. శనివారం ఉదయం మోమిన్పేట మండలం చిట్టంపల్లి వద్ద ఆర్టీసీ బస్సు, లారీ, ఆటో ఢీకొన్నాయి. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరికొంతమంది గాయపడ్డారు. సమాచారం …
మహబూబ్ నగర్ జిల్లా మన్నెంకొండ దేవస్థానం సమీపంలో గత వారం రోజుల నుంచి రెండు చిరుత పులుల సంచరిస్తుండటంతో మన్యం కొండ గుట్ట పైకి వెళ్లే భక్తులు భయాందోళనకు గురి అవుతున్నారు. గత వారం రోజుల కిందట మన్నెంకొండ సమీపంలోని ఓబులయా పల్లె …
అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్న రష్మి ఇటీవల సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్న వైనం అనారోగ్య లక్షణాలు కనిపించడంలో టెస్ట్చేయించుకున్న రష్మి ఓ వైపు బుల్లి తెరపై హాట్ యాంకర్ గా కొనసాగుతూనే, సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరిసింది రష్మి గౌతమ్. …
ఈ రోజు ఉదయం స్టూడియోలో ప్రమాదమంటూ ప్రచారం మీడియాలో కొన్నివార్తలు వస్తున్నాయి అవి తప్పుడు వార్తలు బాధపడాల్సిన పనేం లేదు అంతా బాగానే ఉంది హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం జరిగిందంటూ వస్తోన్న వార్తలపై సినీన టు డు నాగార్జున …
సాయి తేజ్ హీరోగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఒగ్గేసి పోకే ‘అమృత’ అంటూ సాగుతున్న పాట ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘అమృత’ సాంగ్ విడుదల యంగ్ హీరో సాయి తేజ్ నటిస్తోన్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా నుంచి మరో …
ఇటీవలే మొదలైన ‘వకీల్ సాబ్’ షూట్ అంజలి, నివేద థామస్ లపై చిత్రీకరణ దసరాకి సినిమా నుంచి అప్ డేట్ సంక్రాంతికి విడుదల చేసే యత్నాలు లాక్ డౌన్ మూలంగా అంతరాయం కలగడంతో ఆగిపోయిన తెలుగు సినిమాల షూటింగులు ఆరు …
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం రోడ్లపై నిలిచిన నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలి మ్యాన్ హోళ్లు ఉన్న ప్రాంతాల్లో సురక్షిత చర్యలు చేపట్టాలి ప్రభావిత ప్రజలను ఫంక్షన్హాళ్లు, కమ్యూనిటీ హాళ్లకు తరలించాలి తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతోన్న నేపథ్యంలో చేపట్టవలసిన సహాయక చర్యలపై …
ఎఫ్3లో కమెడియన్ సునీల్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఆయన నిజంగానే నటిస్తే ఈ సినిమాలో మరింత ఫన్ ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది సైడ్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ కమెడియన్గా మారిన సునీల్.. ఆ తర్వాత హీరోగా …
కొవిడ్-19 నేపథ్యంలో వినూత్న కార్యక్రమం ప్రజల్లో స్ఫూర్తిని నింపే ప్రయత్నం urlife.co.inలో పేర్లు నమోదు చేసుకోవాలన్న చెర్రీ దివ్యాంగుల కోసం సినీ నటుడు రామ్చరణ్, ఆయన భార్య ఉపాసన కలిసి ఆన్లైన్ డ్యాన్స్ షోను ప్రారంభించనున్నారు. కొవిడ్-19 నేపథ్యంలో తలెత్తిన పరిస్థితుల ప్రభావంగా …
సుధీర్ బాబు భార్య ప్రియ పుట్టినరోజు వేడుకకు వచ్చిన కృష్ణ ఫ్యామిలీ అందరూ కలిసి భోజనం సినీనటుడు సుధీర్బాబు భార్య, మహేశ్ బాబు సోదరి పద్మినీ ప్రియదర్శిని పుట్టినరోజు వేడుక సందర్భంగా సూపర్ కృష్ణ కుటుంబం అంతా ఒకే చోట కలిసి ఎంజాయ్ …
అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్న రష్మి ఇటీవల సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్న వైనం అనారోగ్య లక్షణాలు కనిపించడంలో టెస్ట్చేయించుకున్న రష్మి ఓ వైపు బుల్లి తెరపై హాట్ యాంకర్ గా కొనసాగుతూనే, సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరిసింది రష్మి గౌతమ్. …
ఇటీవల సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్న వైనం
అనారోగ్య లక్షణాలు కనిపించడంలో టెస్ట్చేయించుకున్న రష్మి
ఓ వైపు బుల్లి తెరపై హాట్ యాంకర్ గా కొనసాగుతూనే, సిల్వర్ స్క్రీన్ పై కూడా మెరిసింది రష్మి గౌతమ్. తెలుగు రాష్ట్రాల్లో రష్మికి ఉన్న ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. తాజాగా రష్మి కరోనా బారిన పడింది. స్వ ల్ప అనారోగ్య లక్షణాలు కనిపించడంతో ఆమె కోవిడ్ టెస్ట్ చేయించుకుంది. టెస్ట్ రిపోర్టులో కరోనా పాజి టివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె అధికారికంగా వెల్లడించింది.ఈ నేపథ్యంలో ఈనెల 28 వరకు జబర్దస్త్ షూటింగ్ కార్యక్రమాలను రష్మి రద్దు చేసుకుంది. మరోవైపు రష్మి నటించిన ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యాక్రమాల్లో పాల్గొంటున్న సమ యంలోనే కరోనా సోకడంతో… ఆ కార్యక్రమాలకు కూడా బ్రేక్ ఇచ్చింది. మరోవైపు సుడిగాలి సుధీర్ కూ డా కరోనా బారిన పడినట్టు ప్రచారం జరుగుతోంది.
ఈ రోజు ఉదయం స్టూడియోలో ప్రమాదమంటూ ప్రచారం మీడియాలో కొన్నివార్తలు వస్తున్నాయి అవి తప్పుడు వార్తలు బాధపడాల్సిన పనేం లేదు అంతా బాగానే ఉంది హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం జరిగిందంటూ వస్తోన్న వార్తలపై సినీన టు డు నాగార్జున …
హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం జరిగిందంటూ వస్తోన్న వార్తలపై సినీన టు డు నాగార్జున స్పందించారు. ‘ఈ రోజు ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం జ రి గిం దంటూ మీడియాలో కొన్నివార్తలు వస్తున్నాయి. అయితే, అవి తప్పుడు వార్తలు.. బాధపడాల్సిన పనేం లేదు.. అంతా బాగానే ఉంది’ అని నాగార్జున ట్వీట్ చేశారు కాగా, అన్నపూర్ణ స్టూడియో కూడా తమ అ ధికారిక ట్విట్టర్ ఖాతాలో ఇప్పటికే దీనిపై ఓ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోలో అంతా బాగానే ఉందని, నిర్ధారణ చేసుకోకుండా వార్తలు వ్యాప్తి చేయొద్దని కోరుతున్నామని పేర్కొంది. ని న్న సాయంత్రం అక్కడ అగ్ని ప్రమాదం జరిగిందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం మాత్రం ఆగడం లేదు.
సాయి తేజ్ హీరోగా ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఒగ్గేసి పోకే ‘అమృత’ అంటూ సాగుతున్న పాట ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘అమృత’ సాంగ్ విడుదల యంగ్ హీరో సాయి తేజ్ నటిస్తోన్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా నుంచి మరో …
యంగ్ హీరో సాయి తేజ్ నటిస్తోన్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా నుంచి మరో సాంగ్ విడుదలైంది. సాయితేజ్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ఖాతా ద్వారా ‘అమృత’ పాటను వి డుదల చేశారు. సాయి తేజ్ కు ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే సోలో బ్రతుకే సో బెటర్ సినిమా నుంచి రెండు పాటలు విడుదలయ్యాయి. గతంలో ఈ సినిమా నుంచి ‘నో పెళ్లి’ సాంగ్ని వి డుదల చేసిన సంగతి తెలిసిందే.అనంతరం ‘హాయ్ ఇది నేనేనా’ అనే పాట విడుదలైంది. తాజాగా, లవ్ బ్రే కప్ సాంగ్ విడుదలైంది. ’బల్బు కనిపెట్టినోడికే బతుకు చిమ్మ చీకటైపోయిందే, సెల్ ఫోన్ కంపెనోడికే సి మ్ కార్డు బ్లాకై పోయిందే’ అంటూ ఈ పాట ప్రారంభమవుతుంది. ఒగ్గేసి పోకే ‘అమృత’ అంటూ సాయి తే జ్ తన బాధను ఈ పాట రూపంలో చెబుతున్నాడు.
ఇటీవలే మొదలైన ‘వకీల్ సాబ్’ షూట్ అంజలి, నివేద థామస్ లపై చిత్రీకరణ దసరాకి సినిమా నుంచి అప్ డేట్ సంక్రాంతికి విడుదల చేసే యత్నాలు లాక్ డౌన్ మూలంగా అంతరాయం కలగడంతో ఆగిపోయిన తెలుగు సినిమాల షూటింగులు ఆరు …
లాక్ డౌన్ మూలంగా అంతరాయం కలగడంతో ఆగిపోయిన తెలుగు సినిమాల షూటింగులు ఆరు నెలల తర్వాత ఒక్కొక్కటీ మళ్లీ మొదలవుతున్నాయి. ఇప్పటికే కొందరు హైదరాబాదులో షూటింగ్ చేస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న ‘రాధే శ్యామ్’ చిత్రం యూనిట్ అయితే, ఇటలీకి వెళ్లి మరీ ప్రస్తుతం షూ టింగ్ చేస్తోంది.అలాగే, పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’ చిత్రం షూటింగ్ కూడా ఇటీవల హైదరా బాదులో మొదలైంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ప్రస్తుతం అంజలి, నివేద థామస్ తదితరులు పాల్గొంటున్న సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.ఇక విజయదశమి పండగ తర్వాత నుంచి పవన్ కల్యాణ్ కూడా ఈ చిత్రం షూటింగులో పాల్గొంటారని తాజా సమాచారం. లాక్ డౌ న్ కి ముందే ఆయన షూటింగ్ చాలా పూర్తవడంతో, ఇక కొన్ని రోజులు షూటింగ్ చేస్తే ఆయన పార్ట్ పూ ర్తవుతుంది ఇదిలావుంచితే, దసరా పండగకి ఈ చిత్రం నుంచి ఒక అప్ డేట్ వస్తుందని అం టు న్నా రు. మరి అది టీజరా? లేక మరొకటా? అన్నది త్వరలో తెలుస్తుంది. పవన్ చాలా కాలం గ్యాప్ తర్వాత నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతో ఆత్రుతతో ఎ దురు చూ స్తు న్నారు. వచ్చే సంక్రాంతి పండుగకు దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు ప్ర య త్నిస్తున్నారు.
ఎఫ్3లో కమెడియన్ సునీల్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఆయన నిజంగానే నటిస్తే ఈ సినిమాలో మరింత ఫన్ ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది సైడ్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ కమెడియన్గా మారిన సునీల్.. ఆ తర్వాత హీరోగా …
ఎఫ్3లో కమెడియన్ సునీల్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఆయన నిజంగానే నటిస్తే ఈ సినిమాలో మరింత ఫన్ ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది సైడ్ ఆర్టిస్ట్ నుంచి స్టార్ కమెడియన్గా మారిన సునీల్.. ఆ తర్వాత హీరోగా అయ్యారు. మొదట్లో రెండు మూడు హిట్లు సాధించినా ఆ తర్వాత కథల ఎంపికలో అయోమయానికి గురికావడంతో వరుస ప్లాఫులు ఎదురయ్యాయి. దీంతో ఆయనతో హీరోగా అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో మళ్లీ కమెడియన్గా యూటర్న్ తీసుకున్న సునీల్ అరవింద సమేత, అల వైకుంఠపురములో, చిత్రలహరి వంటి సినిమాల్లో నటించారు.ఆ సినిమాల్లో మంచి పేరు రావడంతో ఆర్టిస్ట్గా మళ్లీ బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. టాలీవుడ్లో కొత్తతరం కమెడియన్లు దూసుకుపోతుండటంతో సునీల్కు అంతగా అవకాశాలు రావడం లేదు. నిరాశ చెందకుండా ఏ పాత్ర అయినా సిద్ధమని సంకేతాలు ఇస్తున్నారు. ఇప్పటికే సుకుమార్ – బన్నీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమాలో కీలక పాత్ర కోసం ఆయన్ని తీసుకున్నట్లు సమాచారం. తాజాగా వెంకటేష్, వరుణ్తేజ్తో అనిల్ రావిపూడి తెరకెక్కించబోయే ‘ఎఫ్3’లో సునీల్ కనిపించబోతున్నారట. ఇద్దరు హీరోలతో కలిసి సినిమా మొత్తం సునీల్ కనిపించేలా దర్శకుడు పాత్రను మలిచినట్లు సమాచారం. ఈ వార్తే నిజమైతే సునీల్ టాలీవుడ్లో మళ్లీ బిజీ కావడం ఖాయం.
కొవిడ్-19 నేపథ్యంలో వినూత్న కార్యక్రమం ప్రజల్లో స్ఫూర్తిని నింపే ప్రయత్నం urlife.co.inలో పేర్లు నమోదు చేసుకోవాలన్న చెర్రీ దివ్యాంగుల కోసం సినీ నటుడు రామ్చరణ్, ఆయన భార్య ఉపాసన కలిసి ఆన్లైన్ డ్యాన్స్ షోను ప్రారంభించనున్నారు. కొవిడ్-19 నేపథ్యంలో తలెత్తిన పరిస్థితుల ప్రభావంగా …
దివ్యాంగుల కోసం సినీ నటుడు రామ్చరణ్, ఆయన భార్య ఉపాసన కలిసి ఆన్లైన్ డ్యాన్స్ షోను ప్రారంభించనున్నారు. కొవిడ్-19 నేపథ్యంలో తలెత్తిన పరిస్థితుల ప్రభావంగా నిరాశ చెందుతున్న ప్రజల్లో చైతన్యం నింపాలని వారు భావిస్తున్నారు. దివ్యాంగులు తమ జీవితంలో ఎదుర్కొన్న ఛా లెంజ్లను ఎలా అధిగమించారు? వారు తమ ఆశయాలను ఎలా సాధించారు? అన్న స్ఫూర్తిదాయక వి షయాలను చెర్రీ, ఉపాసన చూపించనున్నారు.వారిని స్ఫూర్తిగా తీసుకుని అందరూ ముందడుగు వేయాలని ఉపాసన చెప్పింది. ఈ సందర్బంగా ఆమె కొందరు దివ్యాంగుల కష్టాలు, వారు వాటిని అ ధిగమించిన పరిస్థితులను వివరించారు. వారిని చూసి స్ఫూర్తిపొందాలని అన్నారుతన హృదయానికి ఎంతో చేరువైన విషయం డ్యాన్సని రామ్ చరణ్ అన్నాడు. సంగీతం, డ్యాన్స్ తనను బాల్యం నుంచే చా లా మందికి చేరువ చేశాయని చెర్రీ చెప్పాడు. ఈ డ్యాన్స్ షోలో పాల్గొనాలనుకునే దివ్యాంగులు urlife .co.inలో పేర్లు నమోదు చేసుకోవాలని వివరించాడు. ఈ కార్యక్రమానికి అందరి నుంచి ఆయన మద్ద తు కోరాడు. నృత్య దర్శకుడు ప్రభుదేవా కూడా వీరికి మద్దతు ఇస్తున్నాడు.
సుధీర్ బాబు భార్య ప్రియ పుట్టినరోజు వేడుకకు వచ్చిన కృష్ణ ఫ్యామిలీ అందరూ కలిసి భోజనం సినీనటుడు సుధీర్బాబు భార్య, మహేశ్ బాబు సోదరి పద్మినీ ప్రియదర్శిని పుట్టినరోజు వేడుక సందర్భంగా సూపర్ కృష్ణ కుటుంబం అంతా ఒకే చోట కలిసి ఎంజాయ్ …
సినీనటుడు సుధీర్బాబు భార్య, మహేశ్ బాబు సోదరి పద్మినీ ప్రియదర్శిని పుట్టినరోజు వేడుక సందర్భంగా సూపర్ కృష్ణ కుటుంబం అంతా ఒకే చోట కలిసి ఎంజాయ్ చేసింది. కేక్ కటింగ్ అయి పోయిన తర్వాత వారంతా కలిసి డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొని, ముచ్చట్లు చెప్పుకుంటూ కడుపునిండా భోజనం చేశారు. చివరకు కృష్ణకు టాటా చెప్పి కారులో పంపించేశారు ఇందుకు సంబంధించిన ఫొటో లను హీరో సుధీర్ బాబు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘ఆ తేదీ వచ్చింది.. నా ప్రేమ ఈ రోజే పు ట్టింది. హ్యాపీ బర్త్ డే ప్రియ’ అని సుధీర్ బాబు అన్నాడు. ఇందులో టీడీపీ ఎంపీ, మహేశ్ బావ గల్లా జ యదేవ్ కూడా పాల్గొన్నారు. సూపర్ స్టార్ కుటుంబం అంతటిని ఒకే చోట చూసిన అభిమానులు సంబ రపడిపోతున్నారు. కృష్ణ ఫ్యామిలీకి సంబంధించిన ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతు న్నాయి.
టాలీవుడ్ లో మల్టీ స్టారర్ చిత్రాల జోరు ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ ఆసక్తి చూపుతున్న పవన్ కల్యాణ్ మరో కీలక పాత్రలో రానా దగ్గుబాటి ఇటీవలి కాలంలో మన టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాలు కూడా వస్తున్నాయి. మంచి కథ …
ఇటీవలి కాలంలో మన టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాలు కూడా వస్తున్నాయి. మంచి కథ దొరికి.. అందులోని పాత్రలు తమకు నచ్చితే కనుక ఇలాంటి సినిమాలు చేయడానికి మన హీరోలు ఎటువంటి సంకోచం లేకుండా ముందుకొస్తున్నారు. ఇప్పటికే స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలసి ‘ఆర్ఆ ర్ఆర్’ సినిమాలో నటిస్తున్నారుఈ క్రమంలో పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కలసి ఓ చిత్రంలో న టిం చనున్నారన్న వార్త తాజాగా టాలీవుడ్ లో వినిపిస్తోంది. మలయాళంలో హిట్టయిన ‘అయ్యప్ప నుమ్ కోషియమ్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి గత కొంత కాలంగా సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ప్రయత్నాలు చేస్తోందిమొదట్లో ఈ రీమేక్ ను బాలకృష్ణతో చేయాలనుకున్నారు . అయితే, ఆయ నకు సినిమా నచ్చకపోవడంతో ఆయన ఈ ప్రాజక్టు పట్ల ఆసక్తి చూపలేదట. తర్వాత ఒకరిద్దరిని అను కున్నా వాళ్లూ డ్రాప్ అయ్యారు. చివరికి ఇప్పుడీ ప్రాజక్టు పవన్ కల్యాణ్ వద్దకు వచ్చింది. సినిమా చూ సిన ప వన్ ఇది చేయడానికి మొగ్గుచూపుతున్నారటఇందులో మరో కీలక పాత్ర కోసం రానా దగ్గు బా టిని ని ర్మాత సంప్రదించారని, ఆయన కూడా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. అయితే ఈ ప్రా జక్టుకు ఇంకా దర్శకుడు ఫిక్స్ కాకపోవడం ఇక్కడ విశేషం. త్వరలోనే ఓ యంగ్ డైరెక్టర్ని ఖాయం చే స్తు న్నారని సమాచారం.
ఆర్ఆర్ఆర్ షూటింగ్ ప్రారంభం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నది నిజమవుతోందన్న చరణ్ వెయిట్ చేయలేకపోతున్నానన్న తారక్ తారక్, రాంచరణ్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం షూటింగ్ చాలా కాలం తర్వాత మళ్లీ ప్రారంభమైంది. ‘రామరాజు ఫర్ భీమ్’ వీడియోను ఈ నెల …
తారక్, రాంచరణ్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం షూటింగ్ చాలా కాలం తర్వాత మళ్లీ ప్రారంభమైంది. ‘రామరాజు ఫర్ భీమ్’ వీడియోను ఈ నెల 22న విడుదల చే యబో తు న్నట్టు దర్శకనిర్మాతలు వెల్లడించారు. ఈ విషయాన్ని చరణ్ కూడా తన సోషల్ మీడియా ద్వారా వెల్ల డించాడు. కొన్ని నెలల తర్వాత మళ్లీ షూటింగ్ లో పాల్గొనడం ఆనందంగా ఉందని చరణ్ చెప్పాడు. అంతేకాదు ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ ఓ కామెంట్ పెట్టాడు. ‘మై డియర్ తారక్ బ్రదర్… మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నది ఇప్పుడు నిజమవుతోంది. నేను నీకు ప్రామిస్ చేసిన విధంగా అక్టోబర్ 22న నీకు మంచి గిఫ్ట్ ఇస్తున్నా’ అని ట్వీట్ చేశారు.మరోవైపు ఎన్టీఆర్ కూడా ట్విట్టర్ ద్వారా స్పం దించాడు. మళ్లీ సెట్స్ మీదకు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. బ్రదర్ చరణ్ అక్టోబర్ 22 వరకు నేను వెయిట్ చేయలేకపోతున్నా అని ట్వీట్ చేశాడు.
ఈ నెల 30న నా పెళ్లి ముంబైలో గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకోబోతున్నాను వివాహ వేడుక నిరాడంబరంగా జరగనుంది కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నందుకు చాలా థ్రిల్గా ఉంది హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన పెళ్లి గురించి ప్రకటన చేసింది. ఆమె ముంబైకి చెందిన …
కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నందుకు చాలా థ్రిల్గా ఉంది
హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన పెళ్లి గురించి ప్రకటన చేసింది. ఆమె ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకోబోతోందని వార్తలు వచ్చిన తెలిసిందే. ఈ విషయంపై ఆమె పూర్తి క్లారిటీ ఇచ్చేస్తూ ట్వీట్టర్లో ప్రకటన చేసింది’నేను ఈ నెల 30న ముంబైలో గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకోబోతున్నానని చాలా సంతోషంతో చెబుతున్నాను. మా దగ్గరి బంధువులతో కలిసి ఈ వివాహ వేడుక నిరాడంబరంగా జరగనుంది. ఈ కరోనా మహమ్మారి మన సంబరాలను పూర్తిస్థాయి లో జరుపుకోనివ్వకుండా చేసింది’ అని ఆమె ట్వీట్ చేసింది’అయినప్పటికీ, కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నందుకు మేము చాలా థ్రిల్గా భావిస్తున్నాము. మీరు కూడా ఇదే తీరుతో మాకు మద్దతు ఇస్తారని కోరుకుంటున్నాను. ఇన్నేళ్లుగా మీరు నాపై చూపిస్తోన్న ప్రేమ పట్ల కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ కొత్త ప్రయాణాన్ని మొదలు పెడుతున్న నేపథ్యంలో మీ ఆశీర్వాదాలను మేము కోరుకుంటున్నాము. ఇకపై కూడా నా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూనే ఉంటాను’ అని కాజల్ ట్వీట్ చేసింది.