

జీఎస్టీ చెల్లించే చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కలిగించింది. (GSTR-3B) జీఎస్టీఆర్-3 బీ రిటర్న్ దాఖలుకు సంబంధించి లేట్ ఫీని ప్రభుత్వం తగ్గించింది. దీంతో జులై 2017 నుంచి జులై 20 20కు సంబంధించిన జీఎస్టీఆర్-3 బీ రిటర్న్స్ను ఈ ఏడాది సెప్టెంబర్ 30లోపు దాఖలు చేస్తే లేట్ ఫీ గరిష్టంగా రూ. 500గానే ఉండనుంది.ఇక ఆ పన్ను చెల్లించని పక్షంలో ఆలస్య రుసుం చెల్లించాల్సిన అవ సరం లేదని కేంద్ర పరోక్ష పన్నుల బోర్డ్ (CBIC) ఓ ప్రకటనలో తెలిపింది. అయితే తగ్గించిన ఆలస్య రు సుం ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకూ దాఖలు చేసిన జీఎస్టీఆర్-3 బీ రిటర్స్న్కు మాత్రమే వర్తిస్తుందని వెల్లడించింది.